మన్యంలో గిరిజనుల కష్టాలు ...భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతంలోని తిమ్మిరి గూడెం కు చెందిన కుడం సింగయ్య గత వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు.దీనితో కుటుంబ సభ్యులు, స్థానిక ఆదివాసీలు రోగిని జెట్టి లో పడుకోబెట్టి గురువారం ఆ గ్రామం నుంచి సుమారు 4 కిమి లు వాగులు,వంకలు దాటుతూ బురద దారిలో దగ్గరలో ఉన్న అంజనాపురం వరకు జెట్టి లో మోసుకు వచ్చారు.అక్కడి నుండి 108 వాహనంలో చర్ల ప్రాధమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. జ్వరంతో బాధపడుతున్న సింగయ్యకు వెంటనే చికిత్స అందించడంతో అతని ఆరోగ్య పరిస్థితి మెరుగు పడింది.
Podchaser is the ultimate destination for podcast data, search, and discovery. Learn More